హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బొల్లారం వద్ద కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బొల్లారం వద్ద వాటర్ ట్యాంకర్ సహాయం మొక్కలకు నీళ్లు పడుతున్న ఇద్దరిని అటుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రగాయాలకు గురికావడంతో మృతి చెందారు. మృతులను జీహెచ్ఎంసీ ఒప్పంద కూలీ సత్తయ్య (50), ట్యాంకర్ క్లీనర్ నవీన్ (19)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.