హైదరాబాద్ : పొట్టకూటి కోసం వలసొచ్చిన కూలీలను గోడ రూపంలో మృత్యువు కబళించింది. ఊపాధి కల్పిస్తున్న రైస్మిల్లే(Rice mill) వారి ఊపిరిని తీసుకుంది. రైస్ మిల్లులో గోడ కూలి(wall collapse) ఇద్దరు కూలీలు మృతి(Two killed) చెందారు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలోని భరణి రైస్ మిల్లులో చోటు చేసుకుంది.
మృతులు బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.