మెదక్ : రెక్కాడితే డొక్కాడని గాని వలస కార్మికులను కారు రూపంలో మృత్యు కబళించింది. ఉపాధి కోసం వలసొచ్చిన బతుకులు రోడ్డు ప్రమాదంలో అనంత వాయవుల్లో కలిసిపోయాయి. కారు స్కూటీని ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం తునికి గ్రామ శివారులో గల డాక్టర్ రామానాయుడు వ్యవసాయ కళాశాల సమీపంలో.. శుక్రవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
వలస కూలీలు ధోహి, సరోజ్, కన్నయ్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు వారి బైక్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ధోహి, సరోజ అక్కడికక్కడే మృతి చెందగా, కన్నయ్యకు తీవ్ర గాయాలు కావడంతో మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, మృతులు నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి శివారులో ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. ధోహి, సరోజ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.