నిజామాబాద్: జిల్లాలోని వేల్పూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లక్కోర వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతులు కమ్మర్పల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.