సూర్యాపేట: జిల్లాలోని చివ్వెంల (Chivvemla) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని గుంజలూరులో రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం తర్వాత లారీ అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.