హైదరాబాద్: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఎడ్లబండిని బైక్ ఢీకొట్టి ఒకరు, బిల్డింగ్ పైనుంచి పడి మరొకరు మృతిచెందారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్లలో శనివారం తెల్లవారుజామున ఓ బైకు ఎడ్లబండిని ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మరణించాడు. ధర్మపురికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తి.. కోరుట్లలో బీడీ ప్యాకింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇవాళ ఉదయం విధులకు వెళ్తూ.. ధర్మపురిలో ఓ బైక్ను లిఫ్ట్ అడిగాడు. కోరుట్ల వెళ్తుండగా నేరెళ్ల సమీపంలో బైక్ ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొట్టింది. ఎడ్లబండి బైక్పై పడింది. దీంతో వెనక కూర్చున్న చంద్రయ్యపై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇక, హైదరాబాద్లోని సైదాబాద్ పీఎస్ పరిధిలో 12 ఏండ్ల బాలుడు మృతిచెందాడు. సైదాబాద్లోని ఎస్బీహెచ్ కాలనీలోని ఓ ఇంటి ఐదో అంతస్తు నుంచి కిందపడి బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. దీనికి సంబందించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.