ములుగు: ములుగు జిల్లా ఏటూరునాగారంలో (Eturnagaram) రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగరం వద్ద 163 జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతులను ములుగు మండలంలోని జాకారానికి చెందిన వల్లాల కృష్ణయ్య (45), వరంగల్కు చెందిన శివ (17)గా గుర్తించారు. తునికాకు సేకరణ కోసం ఛత్తీస్గఢ్కు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లోని జీడిమెట్లలో ఓ బైకును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న యువకుడు మృతిచెందగా, మరొకరు తీవ్రంగాయపడ్డారు.