నాగర్కర్నూల్: జిల్లాలోని వంగూరు మండలంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మండలంలోని చౌదర్పల్లి సమీపంలో ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (KLI) కాలువలోకి బైకు దుసుకెళ్లింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు నీటిలో మునిగి చనిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో యువకుల మృతదేహాలను బయటికి తీశారు. మృతులను రంగాపూర్ గ్రామానికి చెందిన అల్లే నాగరాజు (25), చేర్క నరేష్ (20)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.