యాదాద్రి భువనగిరి : రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేసి చేశారు.
ఈ మేరకు ఏసీపీ వెంకట్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. భువనగిరి పట్టణానికి చెందన అన్నదమ్ములు సయ్యద్ సైఫ్, సయ్యద్ సమీర్ తమ వద్ద పెట్టుబడులు పెడితే.. తక్కువ సమయంలోనే అధిక లాభాలు పొందవచ్చని ప్రజలను నమ్మించి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారన్నారు.
కాగా, ఎలాంటి బిజినెస్ చేయకుండా తమ సొంత లాభాలకు డబ్బులు వాడుకున్నారన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.80 లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల వద్ద నుంచి భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, 29 తులాల బంగారం, రెండు మారుతి కార్లు, నాలుగు యాక్టివ్ ద్విచక్ర వాహనాలు,కెటిఎమ్ బైక్,రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, ఒక కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నామని ఏసీసీ తెలిపారు.
ఇప్పటి వరకు 24 మంది ఫిర్యాదు చేశారని, ఐదు నుంచి ఆరు కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేసినట్లు విచారణలో తెలిసిందన్నారు. ఎవరు మాయమాటలు నమ్మిమోసపోవద్దని ఏసీపీ సూచించారు.