హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ రథ చక్రాలను ప్రగతి పథంలో నడిపించేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికుల దృష్టిని ఆకర్షించేందుకు ఆర్టీసీ ఓ కొత్త పాటను రూపొందించింది. ప్రముఖ సింగర్ రామ్ మిరియాల పాడిన తెలంగాణ ఆన్ ట్రాక్ పాటను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్(ఎంజీబీఎస్) ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. టీఎస్ ఆర్టీసీ కొత్తగా 300 బస్సులను అందుబాటులోకి తేనుందని తెలిపారు. ఇందులో 50 బస్సులను త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను తీసుకువస్తామన్నారు.
టీఎస్ ఆర్టీసీకి ప్రతి రోజు రూ. 14 కోట్ల నుంచి రూ. 15 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 93 బస్ డిపోలు ఉన్నాయని, ఇందులో 40 నుంచి 50 డిపోల నుంచి లాభసాటి ఆదాయం ఉందన్నారు. మిగతా డిపోలను కూడా అభివృద్ధి చేస్తామని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని MGBS ప్రధాన బస్టాండ్ లో ”తెలంగాణ ఆన్ ట్రాక్’ పాట ఆవిష్కరణ జరిగింది@TelanganaCMO @KTRTRS @RaoKavitha @puvvada_ajay @VPRTRS @tsrtcmdoffice @TSRTCHQ @trspartyonline @BRSParty_News @ntdailyonline @TNewsTelugu @TV9Telugu @NtvTeluguLive @secy2chairman @VinodMattela pic.twitter.com/5ZfMFnzRkn
— Goverdhan Bajireddy (@Govardhan_MLA) December 21, 2022