TSRTC | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలవారీ బస్పాస్ వినియోగదారులకు ఇకపై ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ల ఆధారంగా పాస్లను జారీచేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తివేసింది. టోల్ప్లాజా రుసుమును కూడా బస్పాస్తోపాటే వసూలు చేయనున్నది. ఈ మేరకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రస్తుతం నెలవారీ బస్పాస్ వినియోగదారుల నుంచి టోల్ప్లాజా రుసుమును విడిగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతిరోజూ కండక్టర్కు బస్పాస్ను చూపించి టోల్ప్లాజా టికెట్ను తీసుకోవాల్సి వస్తున్నది. కొత్త విధానంలో దీనికి తెరపడనున్నది.