హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ (TSRTC) పాలకమండలి సమావేశమయింది. సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో పాలకమండలి బస్భన్లో భేటీ అయింది. ఎండీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చార్జీల పెంపు సహా అజెండాలోని 300 అంశాలపై చర్చిస్తున్నారు. సంస్థను నష్టాల నుంచి బయటపడేయడానికి ఏం చేయాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. అదేవిధంగా కొత్త బస్సుల కొనుగోలు, ప్రైవేటు బస్సులను నియంత్రించి ఆదాయం సమకూర్చుకోవడంపై చర్చిస్తున్నారు.
ఇటీవల అమల్లోకి తెచ్చిన సెస్లు, కార్గో అండ్ పార్సిల్ సర్వీసు, సొంత స్థలాల్లో ప్రారంభించిన పెట్రోల్ బంక్లు, నర్సింగ్ కళాశాల ఇలా వివిధ అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నది. 2014 తర్వాత ఆర్టీసీ పాలకవర్గం సమావేశమవడం ఇదే మొదటిసారికావడం విశేషం.