రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతిచెందిన డ్రైవర్ కుటుంబాన్ని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం పరామర్శించారు. చికిత్స పొందుతూ మృతి చెందిన డ్రైవర్ కుంటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మియాపూర్ 1 డిపో బస్సు శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్కానియా ఏసీ సర్వీసులో డ్రైవర్ జీవీ రెడ్డి విధులు నిర్వహించారు.బెంగుళూరు నుంచి మియాపూర్ కు తిరిగి వస్తుండగా, గూటి టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ దుర్ఘటనలో డ్రైవర్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుకున్న సజ్జనార్ చౌటుప్పల్ సమీపంలోని అంకిరెడ్డి గూడెం వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. డ్రైవర్ మృతదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అలాగే, జీవీ రెడ్డికి రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా ఇప్పిస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు.