TSPSC | హైదరాబాద్ : జులై 1వ తేదీన నిర్వహించనున్న గ్రూప్-4 రాతపరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు అధికారులు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు వరకు ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
జూలై 1వ తేదీన రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ (TSPSC) అధికారులు సూచించారు.
ఉదయం, మధ్యాహ్నం సెషన్కు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లను క్లోజ్ చేయనున్నట్లు హాల్ టికెట్లలో పేర్కొన్నారు. అయితే అభ్యర్థులెవరూ షూ ధరించి రావొద్దని అధికారులు పేర్కొన్నారు. కేవలం చెప్పులు మాత్రమే ధరించాలని ఆదేశించింది.