TSPSC | హైదరాబాద్ : ఆగస్టు మొదటి వారంలో గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. వచ్చే వారం ఫైనల్ కీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.
ఈ ఏడాది జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక కీని కూడా కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను ఎక్స్పర్ట్ కమిటీకి టీఎస్పీఎస్సీ పంపింది. ఈ క్రమంలో సోమ లేదా మంగళవారాల్లో ఫైనల్ కీని విడుదల చేసే అవకాశం ఉంది. తుది కీని విడుదల చేసిన అనంతరం పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్కు ఎంపిక చేయనుంది టీఎస్పీఎస్సీ.