హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ప్రతిభ ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా ఎంతో పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నది. చిన్న అనుమానం రావడంతోనే టీఎస్పీఎస్సీ పోలీసులకు ఫిర్యాదు చేసి పరీక్ష పేపర్ లీకేజీ విషయాన్ని స్వయంగా వెలుగులోకి తెచ్చింది. పోలీసులు దర్యాప్తు జరిపి ఏఈ పేపర్ లీక్ అయ్యిందని మీడియాకు బహిరంగంగా చె ప్పారు. అందుకు బాధ్యులైన 9 మందిని అ రెస్ట్ చేశారు. లీక్ విషయాన్ని ప్రభుత్వమే బ యటపెట్టినా, కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు శవాలపై పేలాలు ఏరుకొన్నట్టుగా ఈ అంశంపై రాజకీయాలు చేయటం మొదలుపెట్టారు. నిరుద్యోగుల్లో మరింత గందరగోళం సృష్టించేలా నానా యాగీ చేస్తున్నారు. మంగళవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కా ర్యాలయం వద్ద బీజేవైఎం, ఎన్ఎస్యూఐ, టీజేఎస్ కార్యకర్తలు నిరసన పేరుతో విధ్వం సం సృష్టించి కమిషన్ బోర్డును ధ్వంసం చేశారు.
పక్కాగా దర్యాప్తు
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఏండ్ల తరబడి కష్టపడి చదువుతున్న యువతకు నష్టం కలగొద్దన్న లక్ష్యంతో లీకేజీ వ్యవహారంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సైబర్ ఆడిటింగ్తోపాటు ఫోరెన్సిక్ టెస్ట్లు చేసి అన్ని విషయాలను ఆరా తీస్తున్నారు. అయినా ఏమాత్రం బాధ్యత లేకుండా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించిన వేగాన్ని ఉద్యోగార్థులే ప్రశంసిస్తుంటే, నిత్యం రోడ్లపై తిరగటం తప్ప ఏనాడూ పుస్తకం పట్టని కొందరు మాత్రం నానా చర్చ చేయటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఆందోళనలు.. విధ్వంసాలు
నిరసనల పేరుతో కమిషన్ కార్యాలయం ముందు బీజేవైఎం కార్యకర్తలు మంగళవా రం తీవ్ర హంగామా సృష్టించారు. ప్రజా ఆ స్తులను ధ్వంసం చేశారు. దాదాపు 35 మంది ఆందోళనకారులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. వీళ్ల అరాచకానికి రోడ్డుపై వెళ్లే వాహదారులు కూడా హడలిపోయారు. లక్షల మంది నిరుద్యోగ యువతతో ముడిపడి ఉన్న సున్నిత అంశాన్ని తమ రాజకీయ ప్ర యోజనాల కోసం బీజేపీ ఉపయోగించుకొంటున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.