TSPSC | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుంచి 15 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని సంస్థ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఒక అభ్యర్థి తన దరఖాస్తులోని తప్పులను ఒకసారి మాత్రమే సవరించుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
అప్లికేషన్ను పీడీఎఫ్ ఫార్మాట్లో పరిశీలించాలని తెలిపారు. రాష్ట్రంలోని 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు గత డిసెంబర్ 30న వచ్చిన నోటిఫికేషన్కు 9,51, 321 మంది దరఖాస్తు చేశారు. జూలై 1న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనున్నది.