నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 26: టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో పరీక్షలో అనూహ్య ఘటన చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి ఓఎంఆర్ షీట్ను మింగేశాడు. అతడు తన ఓఎంఆర్ షీట్లో వివరాలు తప్పుగా నమోదు చేశాడు. ఆ తర్వాత తప్పును గుర్తించిన అతడు తన ఓఎంఆర్ షీట్ను మింగేశాడు.
పక్కనే టేబుల్పై పరీక్షకు హాజరుకాని అభ్యర్థి ఓఎంఆర్ షీట్ తీసుకొని ఎగ్జామ్ పూర్తిచేశాడు. ఇన్విజిలేటర్..ఆన్సర్ షీట్లను లెక్కించగా ఒక్కటి తక్కువైంది. సీసీ కెమెరాలను పరిశీలించగా, అబ్దుల్ ముఖీద్ ఓఎంఆర్ షీట్ మింగేసిన ట్టు తేలింది. అతడిపై కేసు నమోదు చేశారు.