శనివారం రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నందున పరీక్షాకేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని ఎస్సై, ఏఎస్సై అభ్యర్థులకు టీఎస్ఎల్పీఆర్బీ సూచించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల పరీక్షాకేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకోవాలని సూచించింది.