హైదరాబాద్ : ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గ బృందం బుధవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరివెళ్లింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, కాకతీయ హెరిటేజ్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. పాండు రంగారావు, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకర్ రెడ్డి సభ్యులుగా ఉన్న రాష్ట్ర ప్రాతినిధ్య బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది.
ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయాన్ని యూనెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ కేంద్రంగా ప్రకటించడానికి కేంద్ర టూరిజం శాఖ సహాయ మంత్రి ప్రహాల్ద్ సింగ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞాపన పత్రం సమర్పించాడనికి ఢిల్లీ వెళ్తున్నట్లు ఈ బృందం తెలిపింది.