TS Assembly Elections | తెలంగాణలో ఓట్ల పండుగ గురువారం జరుగనున్నది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగ.. ఉపాధి పనుల కోసం హైదరాబాద్ రాగా.. ఈ క్రమంలో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు జనం బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో జంటనగరాల పరిధిలోని బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిశాయి. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ బస్టాండ్తో పాటు ఉప్పల్ క్రాస్ రోడ్డు ప్రయాణికులతో కళకళలాడాయి. ఎన్నికల సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సైతం అన్ని ఏర్పాట్లు చేసింది.
రద్దీ ఉన్న మార్గాల్లో అదనంగా బస్సు సర్వీసులను పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులతో ట్రావెల్స్కు చెందిన బస్సులు సైతం కిక్కిరిశాయి. ఇదిలా ఉండగా.. పోలింగ్ సందర్భంగా ఈ నెల 30న ఉద్యోగులకు సెలవులు ఇవ్వాల్సిందేనని ప్రైవేటు సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను ఆదేశించింది. అలాగే, ఐటీ కంపెనీలకు కూడా సర్క్యులర్ జారీ చేసింది. కంపెనీలు సెలవులు ప్రకటించటంతో హైదరాబాద్ నుంచి ఉద్యోగులు స్వగ్రామాల బాటపట్టారు. హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఉన్నది. అలాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాచలం, కొత్తగూడెంతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లే వాహనాలతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.