హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్ పోస్టులను కూడా భర్తీచేయాలని విజ్ఞప్తి చేసింది. ఆదివారం టీఆర్టీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం హైదరాబాద్లో నిర్వహించారు. తొలిమెట్టు కార్యక్రమం పర్యవేక్షణకు టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై పునరాలోచించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్కుమార్, ప్రధానకార్యదర్శి కటకం రమేశ్ ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో టీఆర్టీఎఫ్ గౌరవాధ్యక్షుడు మానేటి ప్రతాప్రెడ్డి, లక్కిరెడ్డి సంజీవరెడ్డి, విష్ణుమూర్తి, రాములు, కిరణ్జ్యోతి, మధుసూదన్రెడ్డి, ప్రభాకర్రావు, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.