TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఆరోపణలు చేయడం దుర్మార్గం అని టీఆర్ఎస్వీ( TRSV ) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్( Gellu Srinivas Yadav ) మండిపడ్డారు. పేపర్ లీకేజీలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
సిట్( SIT ) విచారణ జరగకుండా నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్యతో కోర్టులో కేసు వేయించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా కాంగ్రెస్( Congress ) నాయకులు కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ( BJP ) పాలిత రాష్ట్రాల్లో లీకేజీలైతే మంత్రులు, సీఎంలు గాని రాజీనామా చేశారా..? రేవంత్ రెడ్డి బీజేపీకి వంత పాడుతూ పని చేస్తున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారిగా ములాఖత్ అయ్యాయని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.