హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) విస్తృతస్థాయి సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్లో జరుగుతుందని రాష్ర్ట అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ర్ట మంత్రి కే తారకరామారావు హాజరవుతారని తెలిపారు. సమావేశానికి టీఆర్ఎస్వీ రాష్ర్ట కమిటీ సభ్యులు, జిల్లా కోఆర్డినేటర్లు, నియోజకవర్గ అధ్యక్షులు, మండల అధ్యక్షులు హాజరుకావాలని కోరారు.