హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ హిమాయత్నగర్లో గురువారం సీపీఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల చొకాలు ధరించి, నల్ల జెండాలు, ప్ల కార్డులు ప్రదర్శిస్తూ మోదీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ.. కార్మిక, కర్షక, ప్రజల హకులను కాలరాస్తూ, దేశ ఆస్తులను అమ్ముకొంటూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న విశ్వాస ఘాతకుడు ప్రధాని మోదీ అని మండిపడ్డారు.
ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొని రావడం, ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేయడం, సంస్థలను కార్పొరేట్లకు అమ్మేయడం, కార్మిక, కర్షక హకులను కాలరాయడం లాంటి ప్రజావ్యతిరేక చర్యలతో ప్రజానీకాన్ని బీజేపీ ప్రమాదంలోకి నెట్టేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రదర్శన నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిని గృహ నిర్బంధం చేయడాన్ని ఖండించారు.
తెలంగాణ ప్రాంతాన్ని నిజాం పాలించిన సమయంలోనూ ఇంత పెద్దఎత్తున ప్రజలను వేధించలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు వస్తే ఇంత దారుణంగా వ్యవహరించాలా? అని మండిపడ్డారు. మోదీ ఏమైనా మహా నియంతా? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నేత హైదరాబాద్కు వస్తే స్థానిక ప్రజానీకాన్ని, రాజకీయ పార్టీలను ఇంతగా ఇబ్బంది పెట్టాలా? అని ప్రశ్నించారు.