హైదరాబాద్ : టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుపై ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమీక్షించారు. ఈ నెల 15వ తేదీ నాటికి గ్రామ కమిటీలు, 20వ తేదీ నాటికి మండల కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. మండల కమిటీల తర్వాత జిల్లా అధ్యక్షులను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని కేటీఆర్ తెలిపారు. పార్టీ కమిటీల్లో మహిళా కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ సూచించారు.