మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందన్నారు. మూడో వంతు మెజార్టీ మాకే ఉందని స్పష్టం చేశారు.
రైతుల జీవితాల బాగు కోసం సీఎం కేసీఆర్ తపన పడుతుంటే మీకు రాజకీయంగా కనిపిస్తుందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బీజేపీ 1998 లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసింది. మరీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నదని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని రైతుల గురించి బీజేపీ మాట్లాడడం అంటే దయ్యాలు, వేదాలు వల్లించిన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం