నల్లగొండ : రాత్రికి రాత్రే బీజేపీలో చేరిన చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీటీసీ అవ్వారు గీతా శ్రీనివాస్, చేరిపల్లి భాస్కర్లకు ఘోర పరాభవం ఎదురైంది. వారి ఫిరాయింపులను నిరసిస్తూ స్థానిక ప్రజలు గట్టుప్పల్లో భారీ ఎత్తున శవ యాత్ర నిర్వహించారు. వెంకటేశం, గీతా శ్రీనివాస్, భాస్కర్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పిల్లా పాపలతో సహా ఊరు ఊరంతా శవయాత్రలో పాల్గొని తమ నిరసన తెలిపారు.
గట్టుప్పల్లో అడుగు పెడితే సహించేది లేదంటూ కర్నాటి వెంకటేశం, అవ్వారి గీతా శ్రీనివాస్, చేరిపల్లి భాస్కర్లను స్థానికులు హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని గ్రామస్తులు స్పష్టం చేశారు. తామంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని తేల్చిచెప్పారు.