హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ నిరసనలతో హోరెత్తించింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు బీజేపీ, ప్రధాని మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, బాల్క సుమన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేసేందుకు కుట్ర పన్నిన సంఘటనకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను పార్టీ నాయకులు దగ్ధం చేశారు.
అనంతరం తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమ్మంలోని ఎల్కనూరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు కాల్చివేశారు.
ఆసీఫాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు ఆధ్వర్యంలో పీఎం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
పార్టీ ఎమ్మెల్యే లను కొనుగోలుకు ఎరవేసిన బీజేపీ తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయం నుంచి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు శవయాత్ర నిర్వహించి.. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, అమిత్ షాల దిష్టి బొమ్మ దహనం చేశారు.
హైదరాబాద్లో..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో..
నిర్మల్ జిల్లా..
రాజన్న సిరిసిల్లా జిల్లా..
జోగులాంబ గద్వాల జిల్లా..
వనపర్తిలో..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో..
కరీంనగర్ జిల్లాలో..