హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కారుకూతలు కూస్తూ, టీఆర్ఎస్ నాయకులను అసభ్య పదజాలంతో దూషిస్తున్న వైఎస్ షర్మిలపై తెలంగాణ ప్రజానీకం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్న షర్మిలపై నిప్పులు చెరుగుతున్నారు. నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తామని.. షర్మిలకు, ఆమె మద్దతుదారులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కూడా షర్మిల నోరు పారేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా కవితపై షర్మిల విమర్శలు చేశారు. షర్మిల ట్వీట్పై కవిత ఘాటుగా స్పందించారు. కమలం వదిలిన బాణం షర్మిల అని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. మీ లాగా తాను పొలిటికల్ టూరిస్టు కాదు.. రాజ్యం వచ్చాకే రాలేదు నేను.. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను అని ఆమె స్పష్టం చేశారు.
అమ్మా.. కమల బాణం
ఇది మా తెలంగాణం
పాలేవో నీళ్ళేవో తెలిసిన
చైతన్య ప్రజా గణంమీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
నేడు తెలంగాణ రూటు
మీరు కమలం కోవర్టు
ఆరేంజ్ ప్యారేట్టుమీ లాగా
పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
రాజ్యం వచ్చాకే రాలేదు నేను
ఉద్యమంలో నుంచి పుట్టిన
మట్టి ” కవిత” ను నేను ! https://t.co/rkGthDtHF9— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022