జగిత్యాల : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని రాయికల్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రానికి ప్రధాని మోదీ ఖాళీ చేతులతో వచ్చారని, ఉత్తమాటలు, లేని మాటలు, ఉత్తుత్తి మాటలు చెప్పి పోయారు తప్పా చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. “ తెలంగాణకు ఏం చేశారని పలుసార్లు ప్రధానిని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రెండు, మూడుసార్లు ప్రెస్మీట్లు పెట్టి మా రాష్ట్రానికి ఏం చేశారని మోదీని ప్రశ్నించారు. దానికి మోదీ నుంచి సమాధానం రాలేదు. తప్పించుకుని తిరుగుతున్నారు. ఇవాళ వచ్చి ఏదో చిన్న ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని జగిత్యాల ప్రజలంతా గమనించాలి. ఉత్తి మాటుల చెప్పేవాళ్లేవరూ… అభివృద్ధి చేసే నాయకులేవరు .. ఉట్టి మాటలు చెప్పే పార్టీ ఏది… ముఖంచాటేసే పార్టి ఏది… అన్నది ప్రజలు గుర్తించేలా కార్యకర్తలు పనిచేయాలని కవిత సూచించారు. జగిత్యాలను సంజయ్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. పట్టుదలతో పనిచేస్తున్న సంజయ్కి తాము అంతా అండగా ఉండి సహాయసహకారాలు అందిస్తామని కవిత స్పష్టం చేశారు.