హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి నిప్పులు చెరిగారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో కవిత మాట్లాడుతూ.. మాది రైతు ప్రభుత్వం అని తేల్చిచెప్పారు. మోదీ కార్పొరేట్లకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులను మోదీ గాలికి వదిలేస్తే.. కేసీఆర్ మాత్రం రైతులకు అండగా నిలబడ్డారని స్పష్టం చేశారు.
దేశానికి అందించే బియ్యంలో తెలంగాణ నుంచే 40 శాతం ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నాం చేశాం. కానీ కేంద్రం నుంచి స్పందన రాలేదన్నారు. ఈ క్రమంలో యాసంగింలో పండించిన వరి ధాన్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయాన్ని కవిత గుర్తు చేశారు.
#WATCH Telangana | We’ve taken a decision that from the state budget, state government will procure all the paddy from the farmers. Ours is a farmer-friendly government: TRS MLC K Kavitha pic.twitter.com/3x1hNLiNTn
— ANI (@ANI) April 13, 2022