నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 8 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. ఎనిమిదో రోజైన గురువారం గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు.
గాంధారి మండలకేంద్రంలోని గుండమ్మ కాలువ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని సర్పంచ్ మమ్మాయి సంజీవ్ పొక్లెయిన్ సహాయంతో తొలగింపజేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో చేపడుతున్న పల్లెప్రగతి పనులను ఎంపీడీవో సతీశ్, ఎంపీవో రాజ్కిరణ్రెడ్డి పరిశీలించారు. లింగంపేట మండలంలోని ఐలాపూర్, కొయ్యగుండు తండా, ముస్తాపూర్, మెంగారం, శెట్పల్లి, లింగంపేట, తదితర గ్రామాల్లో సర్పంచులు మొక్కలు నాటారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనాన్ని ఏపీడీ సాయన్న పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ గంగారాం, పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్, ఎంపీవో సవితారెడ్డి, ఏపీవో ధర్మారెడ్డి ఉన్నారు.
బిచ్కుంద మండలకేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను జడ్పీసీఈవో సాయాగౌడ్ పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో ఆనంద్, ఎంపీవో మహబుబ్ ఉన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో పిచ్చిమొక్కల తొలగింపు పనులను అడ్లూర్ ఎల్లారెడ్డి పంచాయతీ ఈవో రాజు, ప్రత్యేకాధికారి అబ్బ లింగం, సర్పంచ్ పైడి జానకి పరిశీలించారు. హెచ్ఎం వల్లభారావు, ఉపాధ్యాయులు ఉన్నారు. మల్లుపేట్లో పల్లెప్రగతి పర్యవేక్షణ అధికారి నామాల లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. సర్పంచ్ సాయిలు, పంచాయతీ కార్యదర్శి గడ్డం మానసారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. కుప్రియాల్లో డ్వాక్రా (ఐకేపీ) సంఘం ఆధ్వర్యంలో రోడ్లను శుభ్రం చేయడంతోపాటు పిచ్చిమొక్కలను తొలగించారు.
నిజాంసాగర్ మండలం మహ్మద్నగర్లో ఏపీఎం రామ్నారాయణగౌడ్, ఒడ్డేపల్లిలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు వారం రోజులుగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలను వివరిస్తూ సంతకాలను సేకరించారు. పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను కూల్చివేశారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని జలాల్పూర్లో పల్లె ప్రకృతివనాన్ని మండల ప్రత్యేక అధికారి రఘునాథ్, ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ కృష్ణ పరిశీలించారు. దోమకొండ మండలంలోని లింగుపల్లి, శేరు బీబీపేట గ్రామాల్లో పల్లెప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారిణి భాగ్యలక్ష్మి పరిశీలించారు. ఆమె వెంట ఎంపీవో తిరుపతి, ఏపీవో రజని, పంచాయతీ కార్యదర్శులు అఖిల, సుధాకర్, సర్పంచులు స్రవంతి, పోగుల సాయిలు ఉన్నారు. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ తండా, క్యాసంపల్లి తండాలో పంచాయతీ రోడ్డుకు ఇరువైపులా మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి కంచెలను ఏర్పాటు చేశారు. బాన్సువాడ పట్టణంలోని డివైడర్ల మధ్యలో మొక్కలు నాటేందుకు చేస్తున్న ఏర్పాట్లను, బీడీ వర్కర్స్ కాలనీలో డ్రైనేజీ నిర్మాణాన్ని బల్దియా చైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. పలు కాలనీల్లో మొక్కలు నాటడంతోపాటు మొక్కలను పంపిణీ చేశారు. కౌన్సిలర్లు గైక్వాడ్ రుక్మిణి, రమాదేవి, పాశం రవీందర్రెడ్డి, వెంకటేశ్, లింగమేశ్వర్, హకీం, నందకుమార్, మోతీరాం పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఓం శాంతి భవనం వద్ద 18వ వార్డు కౌన్సిలర్ మీర్జా హఫీజ్ బ్రహ్మకుమారీలతో కలిసి మొక్కను నాటారు.