హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపై మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లా నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.
ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ ఈ సమావేశం జరిగింది. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, కల్వకుర్తి, షాద్ నగర్, కొడంగల్, LB నగర్, నగరకర్నూల్ అసెంబ్లీ నియోజక వర్గాల తెరాస నేతలకు కార్యాచరణపైన దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి కె. తారక రామారావుతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.