వరంగల్ : బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడం సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు భగ్గుమన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిష్టి బొమ్మల దగ్ధం చేశారు.
రాస్తారోకోలు నిర్వహించి బీజేపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మించాల్సిందేనని లేదంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం చేశారు.ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో..
ములుగు జిల్లాలో..