హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మీడియా అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటును జూన్ 16 వరకు కొనసాగిస్తామని గతంలో ప్రభు త్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఆ హామీని అ మలు చేయకపోవడంతో తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలుచేసింది. పిటిషన్ను జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్రావుతో కూడిన ధర్మాసనం విచారించింది.
కోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వ అధికారుల నుంచి వివరణ కోరుతూ ప్రధానకార్యదర్శి, ఐఅండ్ పీఆర్ శాఖ, సంబంధిత మీడియా అకాడమీలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది.