ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం మంత్రుల నివాస ప్రాంగణంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు కడియ శ్రీహరి, వాణీదేవి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి తదితరులు హాజరయ్యారు.