హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట గులాబీ మయమైంది. దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జమ్మికుంట పట్టణం.. స్వాగత తోరణాలు, బీఆర్ అంబేద్కర్, సీఎం కేసీఆర్ భారీ కటౌట్లతో గులాబీమయంగా మారింది. ఫ్లై ఓవర్ల పొడవునా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.