హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీసీ కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మానాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ దేశంలో 55 శాతానికిపైగా బీసీలు ఉన్నా, కేంద్రం బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని అన్నా రు.
కేంద్రానికి బీసీల పట్ల ఇంత ని ర్లక్ష్యమా? అని నిలదీశారు. ప్రధాని మోదీ బీసీ అయి ఉండి కూడా కేంద్రంలో మంత్రిత్వశాఖ ఏర్పా టు చేయకపోవడం శోచనీయమన్నారు. బీసీ కుల గణన చేయాలని కోర్టులు అనేక కేసుల్లో స్పష్టంగా చెప్పాయని గుర్తుచేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈ తీర్మానాన్ని బలపర్చుతూ.. సీఎం కేసీఆర్ బడుగు బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. కర్ణాటక సంక్షేమశాఖ మంత్రి సీఎం కేసీఆర్ను మెచ్చుకున్నారని తెలిపారు.