హైదరాబాద్ : మలక్పేటలోని ముసారాంబాగ్ రెవెన్యూ భవన్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పలు రెవెన్యూ సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో విధులను, పని భారాన్ని బట్టి నూతన కేడర్ బలోపేతం చేయాలని, జూనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు వివిధ కేడర్ల పదోన్నతులు, పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు, ధరణికి సంబంధించిన అంశాలు, వీఆర్ఏలకు పే స్కేలు వంటి సమస్యలపై చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు.
అనంతరం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రెండు రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కేటీఆర్ను కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్తో పాటు అసోసియేన్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, పీ రాజ్ కుమార్, ఎల్ పూల్ సింగ్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, సీఎల్బీ శాస్త్రి, డి మధుసూదన్, కె నిరంజన్, కార్యదర్శులు సయ్యద్ మౌలానా, కె వెంకట్ రెడ్డి, మనోహర్ చక్రవర్తి, పల్నాటి శ్రీనివాస్ రెడ్డి, చిల్లా శ్రీనివాస్, గుర్రం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శ్రవణ్, సభ్యులు నిర్మల, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.