హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర క్యాడర్ల పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ట్రెసా నేతలు కోరారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్తో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్బంగా వీఆర్ఏల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలిపారు.
రెవెన్యూశాఖలో పదోన్నతులపై నవీన్ మిట్టల్ సానుకూలంగా స్పందించారని, ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో ట్రెసా కార్యవర్గ సభ్యులు రమణ్రెడ్డి, సైదులు, వీఆర్ఏ జేఏసీ నాయకులు రమేశ్ బహదూర్, ఉమామహేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.