నీలగిరి : సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ దవాఖానలో డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం లో కుదేలైన ప్రభుత్వ దవాఖానలను నేడు కార్పొరేట్కు దీటుగా తీర్చిది ద్దారని తెలిపారు. పేదలకు గుదిబండగా మారిన గుండెనొప్పి, క్యాన్సర్ లాంటి వైద్యాన్ని ఉచితంగాఅందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని వివరించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.