హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని 13,046 కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవోలు, డీపీవోలు, జిల్లా పరిషత్ సీఈవోలు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో 50 ఎకో ఫార్మ్ పాండ్లను సెర్ప్-ఎన్ఆర్ఎల్ఎం, పశుసంవర్ధక, మత్స్యశాఖల సమన్వయంతో అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం వీబీ-జీ రామ్-జీ, తెలంగాణ జలసిరి, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుపై సమీక్షించారు.