Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో గాయపడినవారిని వేగంగా దవాఖానకు చేర్చడం, అక్కడ అంతే వేగంగా చికిత్స అందించడం ఎంతో ముఖ్యం. దీంతో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం మేరకు రాష్ట్రంలో ట్రామా కేర్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు వైద్యారోగ్య ‘తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేషన్’ (టెరి)కు శ్రీకారం చుట్టింది. ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే కేసుల్లో అత్య ధికంగా 24 శాతం ట్రామా, రోడ్డు ప్రమాద బాధితులే ఉంటున్నారు. ఇలాంటి వారికి సత్వర చికిత్స అం దించేందుకు ‘టెరి’లో భాగంగా అన్ని జిల్లాల్లోని ప్రధాన రహదార్లను కలుపుతూ 55 దవాఖానల్లో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని సామర్థ్యం, వసతుల ఆధారంగా లెవల్-1, లెవల్-2, లెవల్-3 దవాఖానలుగా విభజించింది.
దవాఖానలో చేరక ముందు, తర్వాత’
‘టెరి’లో భాగంగా సేవలను ప్రీ-హాస్పిటల్ (దవాఖానకు చేరకముందు), ఇంట్రా-హాస్పిటల్ (దవాఖానలో చేరిన తర్వాత) కేర్ అని రెండు రకాలుగా విభజించారు. తదనుగుణంగా సదుపాయాల కల్పన, సేవల మెరుగుపై దృష్టిసారిస్తారు.
ప్రీ-హాస్పిటల్ కేర్
ప్రమాద బాధితులను వేగంగా దవాఖానకు చేర్చడం, మార్గమధ్యంలో ప్రాథమిక వైద్యం అందించడం దీని లక్ష్యం. ప్రమాద స్థలానికి 108 అంబులెన్స్లు వేగంగా చేరేలా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. వా హనంలో అత్యవసర సేవలు అందించేలా శిక్ష ణ పొందిన ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్), సీపీఆర్ చేసేందుకు ఏఈడీ లాంటి పరికరాలు ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 292 అంబులెన్సుల్లో ఏఈడీలు ఉన్నా యి. మిగతా 133 అంబులెన్సుల్లో త్వరలో ఏర్పాటు చేస్తారు. బాధితుడిని 108 వాహనంలోకి చేర్చగానే ఈఎంటీ అతడి ఆరోగ్య పరిస్థితిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలు సమీపంలోని దవాఖానకు చేరుతాయి. దీంతో వెంటనే అక్కడ అత్యవసర విభాగంలోని వైద్యులు అప్రమత్తమై, బాధితుడి లక్షణాల ఆధారంగా ఎలాంటి చికిత్స అందించాలో ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉంటారు. దీంతో ఎంతో సమయం కలిసి వస్తుంది.
ఇంట్రా-హాస్పిటల్ కేర్
‘టెరి’ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న దవాఖానల్లో ప్రస్తుతం ఉన్న క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లను ‘ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్’గా మార్చుతారు. అంబులెన్సులు సులభంగా వచ్చిపోయేలా ఏర్పాట్లు, వాహనం నుంచి దిగగానే ఎమర్జెన్సీ సేవలు అందేలా సదుపాయాలు కల్పిస్తారు. ఎమర్జెన్సీ విభాగం సులువుగా గుర్తించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక ఓపీ సేవలు కొనసాగిస్తారు. కుర్చీలు, స్ట్రెచర్లు, ట్రాలీలు, వీల్చైర్లు లాంటివి ఎమర్జెన్సీ వద్ద అందుబాటులో ఉంచుతారు. లోపల తక్షణ చికిత్స అందించేందుకు ప్రత్యేకమైన స్థలం (ట్రయాజ్) ఉంటుంది. ఇందులో 4 ‘క్లినికల్ మేనేజ్మెంట్ జోన్లు’ ఉంటాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల సూచీలతో వాటిని విభజిస్తారు. బాధితుడి సమస్య తీవ్రతను బట్టి ఆయా జోన్లలోకి తీసుకెళ్లి చికిత్స అందిస్తారు. ట్రయాజ్లో మల్టీ పారామీటర్ మానిటర్లు, మెడికల్ గ్యాస్ ఔట్లెట్స్ ఇతర వైద్య సదుపాయాలు, ల్యాబ్లు, సర్జికల్ థియేటర్లు అందుబాటులో ఉంటాయి. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహచ్ఎస్) ప్రకారం 5 వేల చదరపు అడుగుల్లో 10 పడకల ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు.
ఆధునిక పరికరాలు.. సకల సదుపాయాలు
టెరి కేంద్రాలు ఏర్పాటు చేసే టీచింగ్ దవాఖానల్లో 30 పడకలు, టీవీవీపీ దవాఖానల్లో సామర్థ్యాన్ని బట్టి 5, 10, 15, 20 పడకలను ఎమర్జెన్సీ విభాగానికి కేటాయిస్తారు. బాధితులకు సత్వర చికిత్స ప్రారంభించేలా అన్ని రకాల అధునాతన పరికరాలు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఆటోక్లేవ్ మెషీన్, మొబైల్ ఎక్స్రే, ఈ-ఫాస్ట్, సక్షన్ ఆపరేటర్స్, డీఫ్రిబ్రిలేటర్స్, సీ-ఆర్మ్, అల్ట్రాసోనోగ్రఫీ, అల్ట్రా సౌండ్, సీటీ సాన్, వెంటిలేటర్లు, ఓటీ ఎక్విప్మెంట్ లాంటి పరికరాలను సమకూర్చుతారు. టెరి కేంద్రాల్లో మొత్తం 7 విభాగాలకు చెందిన స్పెషాలిటీ వైద్యులు, 7 విభాగాలకు చెందిన నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. మొత్తంగా లెవల్-1 దవాఖానల్లో 237 మంది, లెవల్-2లో 101 మంది, లెవల్-3లో 73 మంది చొప్పున వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు. వీరికి జిల్లా స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్ అందజేస్తారు.
పూర్తి సమన్వయంతో ఎమర్జెన్సీ వైద్య సేవలు
రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, ఇతర తీవ్ర సమస్యల బారిన పడినవారికి సరైన సమయంలో అత్యవసర వైద్యం అందక ఎన్నో విలువైన ప్రాణాలు పోతున్నాయి. దీన్ని నివారించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘టెరి’కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 55 చోట్ల ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మాతాశిశు అత్యవసర సేవలు, ఇతర మెడికల్, సర్జికల్ ఎమర్జెన్సీ సమయాల్లో తక్షణం అత్యవసర సేవలు అందుతాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే బాధితులను దవాఖానకు చేర్చడం మొదలుకొని వారికి అవసరమైన వైద్యం అందించే వరకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయి. తద్వారా ఎకడా ఆలస్యం జరగకుండా, ప్రాణ నష్టం కాకుండా చూసుకోవడం సాధ్యమవుతుంది. ఎంపిక చేసిన దవాఖానల్లో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం.
– వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
ప్రస్తుతం ఎమర్జెన్సీ విభాగాలకు వచ్చే కేసుల ఆధారంగా.. ట్రామా కేంద్రాల్లో ఎవరెవరికి సేవలు అవసరమో గుర్తించి ఆరు పిల్లర్లుగా విభజించారు. అవేమిటంటే..