హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 47 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా డీఎస్పీలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర పోలీస్శాఖ సంచలన నిర్ణయం తీసుకున్నది. గతంలో ఎస్ఐబీలో కీలకంగా వ్యవహరించి, ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావును సస్పెండ్ చేసింది. ఎస్ఐబీ పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో ఆయనపై ఈ చర్య తీసుకున్నట్టు పోలీస్శాఖ ప్రకటించింది. ఎస్ఐబీలో పనిచేసిన సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.