హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : పోలీసు కొలువుల్లో చేరి.. తొలి జీతం అందుకొనేందుకు అష్టకష్టాలు అనుభవించిన కానిస్టేబుళ్ల బాధ వర్ణనాతీతంగా ఉన్నది. ఫిబ్రవరి 14న ఎంతో ఆశగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నుంచి నియామక పత్రాలు అందుకున్నా.. శిక్షణలో విజయవంతంగా పాల్గొంటున్నా.. వేతనాలు ఆలస్యం కావడంతో ట్రైనీ కానిస్టేబుళ్లు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
వీరి వేతనాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఇంకా బడ్జెట్ రిలీజ్ చేయకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పలు ట్రైనింగ్ కాలేజీల్లో 9,333 మందికిపైగా శిక్షణ పొందుతున్నారు.