హైదరాబాద్ : ప్రస్తుత స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యేందుకు యువత పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క వీడియోతో ఓవర్నైట్లో ఫేసమ్ అవుతామనుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కొందరు చేసిన పనులు ప్రాణాల మీదకు తీసుకువచ్చిన సంఘటనలున్నాయి. మరికొన్ని సందర్భాల్లో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. ఇలాంటి ఘటనలు చూసినా మార్పురావడం లేదు.
తాజాగా ఇలాంటి ఘటనే హనుమకొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. వడ్డేనపల్లికి చెందిన అజయ్ అనే యువకుడు ఆదివారం ముగ్గురు స్నేహితులతో కలిసి ఇన్స్టా రీల్స్ చేసేందుకు రైల్వేట్రాక్ వద్దకు వెళ్లాడు. వెనుక నుంచి ట్రైన్ వస్తుండగా.. ట్రాక్ పక్క నుంచి వీడియో చేస్తున్నాడు. ఈ క్రమంలో కాజీపేట నుంచి బల్లార్షా మార్గంలో వెళ్తున్న రైలు అజయ్ని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కాగా.. అజయ్నిఅతని స్నేహితులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు.