హైదరాబాద్: ప్రధాని మోదీ (PM Modi) మరోసారి హైదరాబాద్కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో (Parade grounds) నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజ్ ఎక్స్ రోడ్స్ను ఊసివేయనున్నారు. పలు మార్గాల్లో దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.