హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో (LB Stadium) మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి ప్రధాని మోదీ (PM Modi) హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ సమయంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కన ప్రాంతాల్లో రహదారుల మూసివేత, దారిమళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.