హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 నుంచి జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ సమయంలో పలు మార్గాల్లో మూసివేతలు, దారిమళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.